భూములు ఇస్తాం కానీ... షరతులు వర్తిస్తాయి! చంద్రబాబుకు రైతుల డిమాండ్!
Thu May 08, 2025 12:50 Others.202505084407.jpg)
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో మరో విడత అమరావతిలో భూసమీకరణకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియను కూడా సమాంతరంగా కొనసాగిస్తోంది. ఇందుకోసం గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేస్తోంది. భూసమీరణపై రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. వారి అనుమానాలు నివృత్తి వచేసి భూముల్ని తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది.
ఇందులో రైతులు మరో విడత తమ భూముల్ని రాజధాని అవసరాల కోసం ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం రాజధానిలో చేపట్టే నిర్మాణాలు, పరిశ్రమలు, ఇతర అవసరాలకు భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు వారు తాజాగా పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రామసభల్లో పేర్కొన్నారు. అయితే ఇందుకు వారు కొన్ని కీలక షరతులు పెడుతున్నారు. వీటికి అంగీకరిస్తే తమ భూములిచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో కీలక మలుపు! జగన్ సన్నిహితుడి ఇంట్లో SIT తనిఖీలు!
తాజాగా పెదకూరపాడు నియోజకవర్గంలో దాదాపు 10 వేల ఎకరాల భూసమీకరణ కోసం భూములు ఇచ్చే రైతుల్ని పిలిపించి గ్రామసభ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న రైతులు ప్రభుత్వం ముందు కొన్ని షరతులు పెట్టారు. ఇందులో ప్రధానంగా రాజధానికి తాము ఇచ్చే 10 వేల ఎకరాల భూముల్లో ఏయే నిర్మాణాలు చేపడుతున్నారో ముందుగానే చెప్పాలని రైతులు కోరారు. అలాగే ఐటీ కంపెనీల్ని విశాఖకు, పరిశ్రమల్ని తిరుపతి శ్రీసిటీకి కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని అధికారులకు వారు గుర్తుచేశారు. అటువంటప్పుడు అమరావతిలో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో చెప్పాలని కోరారు.
దీంతో పాటు తమ భూములు తీసుకుని బదులుగా ఇచ్చే ప్లాట్లు రైల్వేస్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పువైపున ఉండేలా ఇవ్వాలని పెదకూరపాడు నియోజకవర్గ రైతులు కోరారు. ప్రస్తుతం ఎకరాకు ఏడాదికి 60 వేల కౌలు ఇవ్వాలని, దాన్ని ఏటా 10 శాతం పెంచుకుంటూ పోవాలని కోరారు. వచ్చే నెల నుంచే ఈ కౌలు చెల్లింపులు చేయాలంటున్నారు. ప్రభుత్వ భూములు, ఆలయ భూములు కాకుండా రిజిస్ట్రేషన్ భూముల్లోనే తమకు ప్లాట్లు ఇవ్వాలంటున్నారు. రైల్వే ప్రాజెక్టుకు భూమి తీసుకుంటున్నారు కాబట్టి తమ పిల్లలకు రైల్వేలో ఉద్యోగాలు కావాలని కోరారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పాక్కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...
ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?
ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!
వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!
జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..
షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!
నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు
పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Amaravati #AmaravatiCapital #LandPooling #FarmersDemand #APPolitics #ChandrababuNaid
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.